Please enable javascript.బన్సాల్ ఐపీఓ జీఎంపీ: Bansal Wire Industries IPO : బన్సాల్ వైర్ ఇండస్ట్రీస్ ఐపీఓ ప్రారంభం.. జీఎంపీ ఎంతంటే..? - bansal wire industries ipo opens for subscription check gmp and other details | The Economic Times Telugu

Bansal Wire Industries IPO : బన్సాల్ వైర్ ఇండస్ట్రీస్ ఐపీఓ ప్రారంభం.. జీఎంపీ ఎంతంటే..?

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 3 Jul 2024, 12:25 pm

బన్సాల్ వైర్ ఇండస్ట్రీస్ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు జూలై 5 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు. ఐపీఓ ద్వారా రూ. 745 కోట్ల నిధులు సేకరించాలని కంపనీ భావిస్తోంది. ఇది పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ. ప్రారంభమైన కాసేపటికే ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

 
bansal IPO

Representative Image


బన్సాల్ వైర్ ఇండస్ట్రీస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ సబ్ స్క్రిప్షన్ ఈరోజే ప్రారంభమైంది. జూలై 5, శుక్రవారం వరకు అందుబాటులో ఉంటుంది. ఐపీఓ ద్వారా రూ. 745 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తి 2.91 కోట్ల షేర్ల ఫ్రెష్ ఇష్యూ. ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ రూ. 243 - 256 గా ఉంది. ఒక్క లాట్ లో 58 షేర్లుంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు కనీసం రూ. 14,848 పెట్టుబడితో బిడ్డింగ్ లో పాల్గొనాలి. ఈ ఐపీఓకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ముఖ్యమైన తేదీలు

  • ఐపీఓ ఓపెన్ - జూలై 3

  • ఐపీఓ క్లోజింగ్ - జూలై 5

  • షేర్ల అలాట్మెంట్ - జూలై 8

  • రీఫండ్ - జూలై 9

  • డ్యీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల బదిలీ - జూలై 9

  • స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ - జూలై 10

కంపెనీ గురించి
బన్సాల్ వైర్ ఇండస్ట్రీస్ కు బన్సాల్ స్టీల్ అండ్ వపర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఉంది. మూడు బ్రాడ్ సెగ్మెంట్లలో 3000 కు పైగా స్టాక్ కీపింగ్ యూనిట్లను ఆఫర్ చేస్తోంది. హై కార్బన్ స్టీల్ వైర్, మైల్డ్ స్టీల్ వైర్, స్లెయిన్ స్టీల్ వైర్ సెగ్మెంట్లలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్లో నాలుగు తయారీ కేంద్రాలు, యూపీలో మూడు తయారీ కేంద్రాలు, హర్యానాలో ఒక తయారీ కేంద్రాన్ని కలిగి ఉంది. 22 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో డీలర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను కలిగి ఉంది.

ఐపీఓ పత్రాల ప్రకారం కంపెనీ ఆదాయం 2022 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 ఆర్థిక సవంత్సరం వరకు 5.86 శాతం సీఏజీఆర్ వృద్ధితో రూ. 2,205 కోట్ల నుంచి రూ. 2,470 కోట్లకు పెరిగింది. ఈబీఐటీడీఏ 14.87 శాతం వృద్ధితో రూ. 113 కోట్ల నుంచి రూ. 149 కోట్లకు పెరిగింది. పన్ను తర్వాత లాభం 17.28 శాతం పెరిగి రూ. 57.29 కోట్ల నుంచి రూ. 78.80 కోట్లకు చేరింది.

ఐపీఓకు ముందు యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 223 కోట్లు సేకరించింది కంపెనీ. ఒక్కో షేరుకు రూ. 256 ధరతో 87, 30,468 ఈక్విటీ షేర్లను వీరి కోసం కేటాయించింది. ఐపీఓలో 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 50 శాతం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించారు. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, డామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. కేఫిన్ టెక్నాలజీస్ రిజిస్ట్రార్ గా వ్యవహరిస్తోంది.
జీఎంపీ ఎంతంటే..?
ప్రస్తుతం ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 66 గా ఉంది. అంటే ఒక్కో షేరుకు ఇష్యూ ధర కంటే రూ. 66 అధికంగా చెల్లించేందుకు ఇన్వెస్టర్లకు సిద్ధంగా ఉన్నారు. ఇది 25.78 శాతం ప్రీమియాన్ని సూచిస్తోంది. రూ. 322 వద్ద షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మార్కెట్ పరిస్థితిని బట్టి జీఎంపీ రోజురోజుకు మారుతుంది. ఇంకా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More