Please enable javascript.కోటక్ మహీంద్రా బ్యాంక్: Hindenburg Kotak : హిండెన్ బర్గ్ - అదానీ వివాదంలోకి కోటక్ మహీంద్రా.. క్లారిటీ ఇచ్చిన బ్యాంకు.. - hindenburg kotak controversy kotak mahindra bank clarification after sebi notice to hindenburg | The Economic Times Telugu

Hindenburg Kotak : హిండెన్ బర్గ్ - అదానీ వివాదంలోకి కోటక్ మహీంద్రా.. క్లారిటీ ఇచ్చిన బ్యాంకు..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 2 Jul 2024, 5:16 pm

హిండెన్ బర్గ్, అదానీ గ్రూప్ వివాదంలోకి కోటక్ మహీంద్రా బ్యాంకు పేరు తెరపైకి వచ్చింది. సెబీ నుంచి తమకు నోటీసులు అందాయని, కానీ కోటక్ బ్యాంకు పేరను మాత్రం బయటికి రాకుండా కాపాడుతున్నారని హిండెన్ బర్గ్ ఆరోపించింది. అయితే కోటక్ బ్యాంక్ దీనిపై స్పష్టత ఇచ్చింది.

 
Hindenburg Kotak

Representative Image


హిండెన్ బర్గ్ అదానీ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అదానీ గ్రూప్ పై గతేడాది తాము రిలీజ్ చేసిన నివేదిక అనంతరం జరిపిన షార్ట్ సెల్లింగ్ కు సంబంధించి సెబీ నోటీసులు పంపించినట్లు హిండెన్ బర్గ్ వెల్లడించింది. జూన్ 26న తమకు నోటీసుల అందినట్లు తెలిపింది. ఈ నోటీసులపై తీవ్రంగా స్పందించింది. నాన్ సెన్స్ అంటూ కొట్టిపారేసింది. భారత్ కు చెందిన ప్రముఖ బ్యాంక్ కోటక్ మహీంద్రా నిర్వహించే ఫండ్ ఒక పార్ట్ నర్ ఇన్వెస్టర్ ద్వారా అదానీ గ్రూప్ షేర్ల క్షీణత సమయంలో షార్ట్ సెల్ కు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ తెలిపింది. అయితే సెబీ మాత్రం కోటక్ పేరు బయటకు రాకుండా తమకు నోటీసులు పంపి భారత ప్రముఖ కంపెనీలను కాపాడేందుకు ప్రయత్నిస్తూనే, తమను బెదిరించే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.
హిండెన్ బర్గ్ - అదానీ గ్రూప్ వివాదంలోకి కొత్తగా కోటక్ పేరు తెరపైకి రావడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. ఫలితంగా కోటక్ మహీంద్రా షేర్లు ఈరోజు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి 2.5 శాతం నష్టంతో రూ. 1,763 వద్ద స్థిరపడ్డాయి.

కోటక్ మహింద్రా ఇంటర్నేషనల్ లిమిటెడ్ కే-ఇండియా అపార్చునిటీస్ ఫండ్ లిమిటెడ్ (KIOF) పేరుతో విదేశీ ఇన్వెస్టర్ల కోసం ఫండ్ ను ఏర్పాటు చేసింది. ఇది సెబీ వద్ద నమోదైంది. 2013లో ప్రారంభమైంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ ఆఫ్ మారిషస్ దీన్ని నియంత్రిస్తుంది. ఫారెన్ క్లయింట్లు భారత్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఈ ఫండ్ ప్లాట్ పారంగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ ఫండ్ తో ఒక పార్ట్ నర్ ఇన్వెస్టర్ ద్వారా తమ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ ను కోటక్ బ్యాంక్ షార్ట్ సెల్ చేసినట్లు హిండెన్ బర్గ్ తెలిపింది. అయితే దీని ద్వారా పెద్దగా లాభాలు పొందలేకపోయినట్లు కూడా చెప్పింది.

కాగా ఇదే ఇన్వెస్టర్ తో ఉన్న సంబంధాలతోనే తాము కూడా అదానీ స్టాక్స్ ను షార్ట్ సెల్ చేసినట్లు హిండెన్ బర్గ్ పేర్కొంది. అన్ని ఖర్చులు పోనూ తమకు కూడా లాభాలు ఏమీ రాలేదని చెప్పింది. అదానీ స్టాక్స్ ను షార్ట్ సెల్ చేసినట్లు తాము గతేడాది నివేదికను విడుదల చేసినప్పుడే వెల్లండిచామని, ఇందులో రహస్యమేమీ లేదని చెప్పింది. అయితే అదానీ గ్రూప్ స్టాక్స్ లో నింబధనలకు విరుద్ధంగా తాము పెట్టుబడి పెట్టినట్లు సెబీ తాజాగా నోటీసులు పంపినట్లు చెప్పింది. తాము నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించినట్లు తెలిపింది.

మరోవైపు కోటక్ మహీంద్రా ఇంటర్నేషనల్ హిండెన్ బర్గ్ ఆరోపణలపై స్పందించింది. తమకు హిండెన్ బర్గ్ ఏనాడూ క్లయింట్ గా లేదని వెల్లడించింది. బ్యాంక్ ఫారెన్ ఫోలియో ఇన్వెస్టర్ కింగ్ డమ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కు హిండెన్ బర్గ్ క్లయింట్ కాదని పేర్కొంది.

కింగ్ డన్ క్యాపిటల్ మేనెజ్మెంట్ హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత కే-ఇండియా అపార్చునిటీస్ ఫండ్ ద్వారా అదానీ గ్రూప్ స్టాక్స్ ను షార్ట్ సెల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి హిండెన్ బర్గ్ తో సంబంధాలున్నట్లు తమకు సమాచారం లేదని కోటక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. సెబీ నోటీసు తర్వాతే తమకు దీని గురించి తెలిసినట్లు పేర్కొన్నారు.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More