Please enable javascript.ఈ రోజు పెట్రోల్- డీజిల్ ధరలు: Petrol Price Today : వాహనదారులకు గుడ్ న్యూస్.. త్వరలో జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ధరలు? నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదే.. - petrol diesel prices petrol price and diesel price today 25 june 2024 telangana andhra pradesh hyderabad vijayawada | The Economic Times Telugu

Petrol Price Today : వాహనదారులకు గుడ్ న్యూస్.. త్వరలో జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ధరలు? నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదే..

Authored by Rupesh | The Economic Times Telugu | Updated: 25 Jun 2024, 7:12 am

25 జూన్ 2024 తేదీ నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల వివరాలను మీకోసం కింద తెలియచేయడం జరిగింది.

 
Petrol-Diesel Price Today
Representative Image
ఈ రోజు అనగా (25-06-2024) మన రెండు తెలుగు రాష్టాలతో పాటుదేశ రాజధాని ఢిల్లీలో, అలాగే దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో పెట్రోల్, డీజిల్ ధరలను ఒకసారి పరిశీలిస్తే,
ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, విజయవాడలో ఈ రోజు పెట్రోల్ ధర లీటర్ రూ. 109.70 గాను, లీటర్ డీజిల్ ధర రూ. 97.54 గా ఉంది, నిన్నటి ధరతో పోల్చితే ఈ రోజు పెట్రోల్ ధర రూ. 0.12, డీజిల్ ధర రూ. 0.12 పెరిగింది.

ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి, దీనిలో భాగంగా ఇవాళ ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 107.41 లుగా, అలాగే ఒక లీటర్ డీజిల్ ధర రూ. 95.65 లుగా నమోదు అయింది, నిన్నటితో పోల్చితే ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి తేడా లేదు.

అలాగే దేశ రాజధాని అయిన న్యూఢిల్లీ, అలాగే దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబై లో కూడా చాలా రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీ లో ఇవాళ ఒక లీటరు పెట్రోల్ ధర రూ. 94.72 గాను, అలాగే ఒక లీటరు డీజిల్ ధర రూ. 87.62 గాను, అలాగే వాణిజ్య రాజధాని అయిన ముంబై లో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ. 104.21 లు గాను, అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 92.15 లుగా నమోదు అయ్యింది, ఇక నిన్నటితో పోల్చితే ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి తేడా లేదు.

రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, పెట్రోల్-డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ అలోచన అని, అయితే దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రేటును నిర్ణయించాలని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని సంబంధించి ఇప్పటికే ఒక నిబంధన ఉందని, దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లెవీ రేటుపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

మరొకవైపు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ఇంధన ధరలను రూ. 2 లకు పైగా తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా నరేంద్ర మోడీ వరుసగా మూడవసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మరొసారి పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గుతాయని వాహనదారులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. అయితే భవిష్యత్తులో పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని, గత కొన్ని నెలలుగా గ్లోబల్ మార్కెట్ లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడమే దీనికి ప్రధాన కారణం అని దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తున్నాయి.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
Rupesh గురించి
Rupesh Senior Digital Content Producer