Please enable javascript.ఆయిల్ స్టాక్: PSU Oil Stock : ప్రతి రెండు షేర్లకు ఒక షేరు ఉచితం.. రూ. 3.5 తుది డివిడెండ్.. ఆయిల్ స్టాక్ ను కొనుగోలు చేయాలని సూచించిన మోతీలాల్ ఓస్వాల్ - bonus shares and final dividend motilal oswal gave buy rating for psu oil stock with target price rs 775 | The Economic Times Telugu

PSU Oil Stock : ప్రతి రెండు షేర్లకు ఒక షేరు ఉచితం.. రూ. 3.5 తుది డివిడెండ్.. ఆయిల్ స్టాక్ ను కొనుగోలు చేయాలని సూచించిన మోతీలాల్ ఓస్వాల్

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 22 Jun 2024, 4:34 pm

ప్రభుత్వ రంగ స్టాక్ అయిల్ ఇండియా త్వరలో ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు అందించనుంది. అలాగే తుది డివిడెండ్ కూడా చెల్లించనుంది. ఈ స్టాక్ రాబోయే రోజుల్లో రూ. 775 టార్గెట్ ధరను చేరుకునే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ సూచిస్తోంది.

 
Oil Stock
Representative Image
ఆయిల్ ఇండియా లిమిటెడ్ షేర్లు శుక్రవారం 2.52 శాతం వృద్ది నమోదు చేసి రూ. 702 వద్ద స్థిరపడ్డాయి. ఈ ఏడాది ఇప్పటివరకు చూసుకుంటే షేరు ధర 85 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో అయితే 180 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్నులు అందించింది. అయితే ఈ స్టాక్ ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ సూచిస్తోంది. రూ. 775 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చని సూచిస్తూ బై రేటింగ్ కూడా ఇచ్చింది. ఇది 10 శాతం అప్ సైడ్ ను సూచిస్తోంది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆయిల్ ఇండియా నికర లాభం రూ. 2,332.94 కోట్లుగా నమోదైంది. ఇది గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 1,979 కోట్లతో పోల్చితే చాలా ఎక్కువ.
బోనస్ షేర్లు, డివిడెండ్
2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లతో పాటు ప్రతి షేరుకు రూ. 3.75 తుది డివిడెండ్ ను కూడా ప్రకటించింది కంపెనీ. అయితే డివిడెండ్ కు రికార్డు తేదీని ఇంకా ఖరారు చేయలేదు. కానీ బోనస్ షేర్లకు రికార్డు తేదీని జులై 2 గా ఫిక్స్ చేసింది. అంటే ఆ తేదీన మార్కెట్ ముగిసే సమయానికి ఎవరైతే ఈ కంపెనీ షేర్లు కలిగి ఉంటారో వారు మాత్రమే బోనస్ షేర్లు పొందేందుకు అర్హులు. తుది డివిడెండ్ కు త్వరలోనే రికార్డు తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది.

1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లు అంటే షేర్ హోల్డర్లు కలిగి ఉండే ప్రతి రెండు ఈక్విటీ షేర్లకు ఒక షేరును ఉచితంగా పొందుతారు. 100 షేర్లు కలిగి ఉంటే 50 షేర్లు ఉచితంగా లభిస్తాయి. ఎల్ఐసీ కి ఈ కంపెనీలో 8 శాతం వాటా ఉంది. 87,156,697 షేర్లకు బోనస్ షేర్లు బోనస్ షేర్లు లభించనున్నాయి.

బై రేటింగ్
బ్రోకరేజీ మోతీలాల్ ఓస్వాల్ ఆయిల్ ఇండియా స్టాక్ ఇంకా బుల్లిష్ గా ఉందని తెలిపింది. బై రేటింగ్ కూడా ఇచ్చింది. రూ. 775 టార్గెట్ ధరతో దీనిని కొనుగోలు చేయవచ్చని సూచించింది. అయితే మరో బ్రోకరేజ్ కోటక్ సెక్యూరిటీస్ మాత్రం ఆయిల్ ఇండియా స్టాక్ ను డౌన్ గ్రేడ్ చేసింది. సెల్ రేటింగ్ ఇచ్చింది. ఇన్వెస్టర్లు ఈ స్టాక్ ను విక్రయించుకోవాలని సిఫార్సు చేసింది.

గమనిక: ఈ కథనం బ్రోకరేజీలు, విశ్లేషకుల సొంత అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేస్తుంది. స్టాక్స్ ను కొనుగోలు చేయాలని లేదా విక్రయించాలని ఎకనామిక్ టైమ్స్ సూచించదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More