Please enable javascript.రైల్ టెల్ టార్గెట్ ధర: Miniratna PSU Stock : త్వరలో డివిడెండ్ ను ప్రకటించనున్న మినీరత్న పీఎస్యూ స్టాక్.. ఏడాదిలోనే 271 శాతం లాభాలు.. - The Economic Times Telugu

Miniratna PSU Stock : త్వరలో డివిడెండ్ ను ప్రకటించనున్న మినీరత్న పీఎస్యూ స్టాక్.. ఏడాదిలోనే 271 శాతం లాభాలు..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 4 Jul 2024, 10:14 am

మినీరత్న హోదా గల ప్రభుత్వ రంగ కంపెనీ రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డివిడెండ్ పై కీలక ప్రకటన చేసింది. జూలై 8 న జరిగే డైరెక్టర్ల బోర్డు సమావేశంలో డివిడెండ్ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునున్నట్లు తెలిపింది. ఇలాగే ఈ సమావేశంలో ఇతర కీలక విషయాల గురించి చర్చించనున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఫోకస్ లో నిలిచింది. రైల్ టైల్ లిమిటెడ్ షేరు ధర ఏడాది కాలంలో 271 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు అదిరిపోయే రిటర్నులు అందించింది.

 
miniratna psu stock railtel ltd to consider final dividend on july 8 check full details here
Miniratna PSU Stock : త్వరలో డివిడెండ్ ను ప్రకటించనున్న మినీరత్న పీఎస్యూ స్టాక్.. ఏడాదిలోనే 271 శాతం లాభాలు..

డివిడెండ్ హిస్టరీ

రైల్ టెల్ 2021 మార్చి 31 నుంచి ఇప్పటివరకు మొత్తం ఏడు డివిడెండ్లు ప్రకటించింది. గత ఏడాది కాలంలో ఒక్కో షేరుకు రూ. 2.05 డివిడెండ్ రూపంలో చెల్లించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ చెల్లించే విషయంపై జూలై 8న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం రైల్ టెల్ షేరు ధర రూ. 486 గా ఉంది. దీని ప్రకారం ఈ స్టాక్ డివిడెండ్ రాబడి 0.41 శాతంగా ఉంది.

రైల్ టెల్ షేరు టార్గెట్ ధర

ఈ స్టాక్ రాబోయే రోజుల్లో దాదాపు 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని 5 పైసా రీసెర్చ్ లీడ్ రుచిత్ జైన్ అంచనా వేస్తున్నారు. రూ. 480-490 రేంజ్ లో స్టాక్ ను కొనుగోలు చేస్తే రూ. 600 టార్గెట్ ధరను చేరుకునే అవకాశం ఉందన్నారు. అయితే స్టాప్ లాస్ ను కచ్చితంగా రూ. 430 వద్ద సెట్ చేసుకోవాలని స్పష్టం చేశారు.

​కంపెనీ గురించి


రైల్ టెల్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ. మినీరత్న హోదాను కూడా కలిగి ఉంది. భారత్ లో అతిపెద్ద న్యూట్రల్ టెలికాం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ గా ఉంది. దేశవ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ను కలిగి ఉంది. టెలికాం మార్కెట్ లో అదునాత సాంకేతికతలతో ఇన్నోవేటివ్ సర్వీస్ ను అందిస్తుంది. రైలు కార్యకలాపాలు, అడ్మినేషన్ నెట్వర్క్ సిస్టంను కూడా ఆధునికీకరిస్తుంది.

గమనిక: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ రికమండేషన్ కాదు.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More