Please enable javascript.పేపర్ తయారీ కంపెనీలు: Paper Stocks : కాగితపు పరిశ్రమకు పూర్వవైభవం.. రానున్న రోజుల్లో పెరిగే అవకాశమున్న 5 పేపర్ స్టాక్స్.. - six paper stocks to watch score improved over a month can rally in future | The Economic Times Telugu

Paper Stocks : కాగితపు పరిశ్రమకు పూర్వవైభవం.. రానున్న రోజుల్లో పెరిగే అవకాశమున్న 5 పేపర్ స్టాక్స్..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 27 Jun 2024, 5:13 pm

కాగితపు పరిశ్రమకు పూర్వవైభం రానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 పేపర్ తయారీ కంపెనీల స్టాక్స్ మంచి వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇవి గత ఏడాది కాలంలో 180 శాతం వరకు రిటర్నులు అందించాయి. వీటికి సంబంధించిన వివరాలు కింది కథనంలో తెలుసుకోండి.

 
Paper Stocks

Representative Image


ఒకప్పుడు కాగితపు పరిశ్రమ కళకళలాడింది. అప్పుడు డిమాండ్ బాగుండటంతో ఈ పరిశ్రమకు చెందిన కంపెనీలు మంచి ఆదాయాన్ని పొందేవి. దిగ్గజ సంస్థలు కూడా ఈ సెక్టార్లో ఇన్వెస్ట్ చేశాయి. కాలక్రమేణా వార్తా పత్రికల ప్రచురణలు తగ్గడంతో 1994 తర్వాత నుంచి ఈ పరిశ్రమ డీలా పడింది. అయితే రాబోయే రోజుల్లో కాగితపు పరిశ్రమకు మళ్లీ పూర్వవైభవం వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సెక్టార్ కు చెందిన ఐదు స్టాక్స్ రీ రేటింగ్ పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
జేకే పేపర్
ఈ స్టాక్ ఈరోజు 2.3 శాతం పెరిగి రూ. 561 వద్ద స్థిరపడింది. 52 వారాల గరిష్ట స్థాయి రూ. 562 కూడా ఈరోజే నమోదైంది. గత ఏడాది కాలంలో 75 శాతం పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 9,380 కోట్లుగా ఉంది. ఈ స్టాక్ రానున్న రోజుల్లో మంచి రిటర్నులు ఇచ్చే అవకాశం ఉందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. రీ రేటింగ్ పొందవచ్చని పేర్కొన్నారు.

వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్
ఈ స్టాక్ ఈరోజు 1.5 శాతం తగ్గి రూ. 682 వద్ద స్థిరపడింది. 52 వారాల గరిష్ట స్థాయి రూ. 815 గా ఉంది. కనిష్ట స్థాయి రూ. 456 గా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 4,510 కోట్లుగా ఉంది. గత ఏడాది కాలంలో 32 శాతం రిటర్నలు అందించింది. రానున్న రోజుల్లో మంచి వృద్ది నమోదు అవకాశముందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

ఆంధ్రా పేపర్
ఈ స్టాక్ ఈరోజు ఫ్లాట్ గా రూ. 555.80 వద్ద స్థిరపడింది. 52 వారాల గరిష్ట స్థాయి రూ. 674 గానూ, కనిష్ట స్థాయి రూ. 407 గానూ ఉంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 2.22 కోట్లుగా ఉంది. గత ఏడాది కాలంలో 32 శాతం రిటర్నులు ఇచ్చింది. రాబోయే రోజుల్లో వృద్ది నమోదు చేసే అవకాశముంది అని విశ్లేషకులు చెబుతున్నారు.

శేషసాయి పేపర్ అండ్ బోర్డ్స్
ఈ స్టాక్ ఈరోజు రూ. 339 వద్ద స్థిరపడింది. 52 వారాల గరిష్ట స్థాయి రూ. 421 గానూ, కనిష్ట స్థాయి రూ. 254 గానూ ఉంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 2.14 కోట్లుగా ఉంది. గత ఏడాది కాలంలో షేరు ధర 24 శాతం పెరిగింది. రానున్న రోజుల్లో మంచి పనితీరు కనబర్చే అవకాశం ఉందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

పుదుంజీ పేపర్ ప్రొడక్ట్స్
ఈ స్టాక్ ఈరోజు 2.68 శాతం పెరిగి రూ. 115 వద్ద స్థిరపడింది. 52 వారాల గరిష్ట స్థాయి రూ. 117 గా ఉంది. కనిష్ట స్థాయి రూ. 40 గా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,090 కోట్లుగా ఉంది. గత ఏడాది కాలంలో 180 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్నులు అందించింది. రాబోయే రోజుల్లో కూడా వృద్ధి కొనసాగించే అవకాశాలున్నాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

గమనిక: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే. విశ్లేషకుల సొంత అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More