Please enable javascript.ఎక్స్-డివిడెండ్: Ex-Dividend : ఒక్కో షేరుకు ఏకంగా రూ. 60 డివిడెండ్ ను చెల్లించనున్న కంపెనీ.. రేపే రికార్డు డేట్.. ఈ ఒక్క రోజే ఛాన్స్.. - The Economic Times Telugu

Ex-Dividend : ఒక్కో షేరుకు ఏకంగా రూ. 60 డివిడెండ్ ను చెల్లించనున్న కంపెనీ.. రేపే రికార్డు డేట్.. ఈ ఒక్క రోజే ఛాన్స్..

Authored by Rupesh | The Economic Times Telugu | Updated: 27 Jun 2024, 9:37 am

మ్యానిఫ్యాక్చరింగ్ సెక్టార్ కి చెందిన స్మాల్ క్యాప్ కేటగిరి స్టాక్ అయిన మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ షేర్లు జూన్ 28 అనగా రేపు ఎక్స్-డివిడెండ్ ను ట్రేడ్ చేయనుంది.

 
small cap manufacturing sector stock will trade ex-dividend tomorrow stock analyst gave target price
Ex-Dividend : ఒక్కో షేరుకు ఏకంగా రూ. 60 డివిడెండ్ ను చెల్లించనున్న కంపెనీ.. రేపే రికార్డు డేట్.. ఈ ఒక్క రోజే ఛాన్స్..
స్మాల్ క్యాప్ కేటగిరికి చెందిన మ్యానిఫ్యాక్చరింగ్ సెక్టార్ స్టాక్ అయిన మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్, ఏప్రిల్ 24 న జరిగిన కంపెనీ బోర్డు అఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 2024 ఆర్ధిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసికానికి సంబంధించి ఆర్ధిక ఫలితాలతో పాటు ఒక్కో షేరుకు రూ. 60 ఫైనల్ డివిడెండ్ ను కంపెనీ డైరెక్టర్స్ బోర్డు సిఫార్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ ఫైనల్ డివిడెండ్ కి సంబంధించి కంపెనీ జూన్ 28 ని రికార్డు తేదీగా ప్రకటించింది.
ఇక జూన్ 28 రేపే కావడం, అలాగే ఈ కంపెనీ షేర్లు రేపు ఎక్స్-డివిడెండ్ ను ట్రేడ్ చేయనుడడంతో ఈ కంపెనీ షేరుపై అందరి దృష్టి పడింది. దీంతో ఈరోజు ట్రేడింగ్ లో మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ షేర్ మంచి లాభాన్ని అందించే అవకాశం ఉందని బ్రోకరేజ్ కంపెనీలు భావిస్తున్నాయి. దీనిలో భాగంగా మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ షేరుకు బై రేటింగ్ తో పాటు రూ. 9500 టార్గెట్ ప్రైజ్ ను ఇస్తున్నట్లు ప్రముఖ బ్రోకరేజ్ కంపెనీ అయిన ఛాయస్ బ్రోకింగ్ కి చెందిన స్టాక్ అనలిస్ట్ మందర్ భోజానే పెట్టుబడిదారులకు సూచించడం జరిగింది.

అలాగే ఈ కంపెనీ షేరుకు రూ. 8075 స్టాప్ లాస్ ను కూడా అనలిస్ట్ అందించడం జరిగింది. ఒకవేళ ప్రస్తుత ధర వద్ద ఈ కంపనీ షేరును కొనుగోలు చేస్తే సుమారు 10 శాతం లాభం పొందే అవకాశం ఉందని స్టాక్ అనలిస్ట్ తెలిపారు. మరొకవైపు ఈ కంపెనీ షేరు గత ఏడాది కాలంలో 59 శాతం లాభాన్ని తమ వాటాదారులకు అందించింది.

డివిడెండ్ :

ఏప్రిల్ 24 నాటి కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం, 2024 ఆర్ధిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసికానికి గాను రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 60 ఫైనల్ డివిడెండ్ ను కంపెనీ బోర్డు సిఫార్స్ చేయడం జరిగిందని, ఈ ఫైనల్ డివిడెండ్ కి సంబంధించి కంపెనీ జూన్ 28 ని రికార్డు తేదీగా ప్రకటించిందని, అలాగే ఈ డివిడెండ్ అనేది జూలై 22 న జరగనున్న కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో కంపెనీ వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుందని, ఒకవేళ వాటాదారుల ఆమోదం పొందినట్లైతే, డివిడెండ్ ను జూలై 26 లేదా జూలై 27 తేదీలలో షేర్ హోల్డర్స్ కి చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది.

షేర్ అవుట్ లుక్ :

ఈరోజు ట్రేడింగ్ సెషన్ లో మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ షేరు ధర సుమారు 0.2 శాతం లాభపడి రూ. 8768 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక ఈ షేరు 52 వారాల గరిష్ట ధర రూ. 9178 గాను, అలాగే 52 వారాల కనిష్ట ధర రూ. 5406 గా ఉంది. గత ఒక వారం రోజుల్లో ఈ షేరు ధర సుమారు 4 శాతం లాభాన్ని, అలాగే గత నెల రోజుల్లో సుమారు 16 శాతం లాభాన్ని, అదే విధంగా గత ఆరు నెలల్లో సుమారు 18 శాతం లాభాన్ని, అదే గత ఏడాది కాలంలో సుమారు 59 శాతం లాభాన్ని, ఇక గత ఐదు సంవత్సరాలలో సుమారు 90 శాతం లాభాన్ని తమ వాటాదారులకు అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 10,020 కోట్లుగా ఉంది.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
Rupesh గురించి
Rupesh Senior Digital Content Producer