Please enable javascript.indiramma housing scheme telangana: Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి కీలక ప్రకటన.. బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపు.. - indiramma housing scheme telangana minister ponguleti srinivas reddy say big allocations in budget | The Economic Times Telugu

Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి కీలక ప్రకటన.. బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపు..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 2 Jul 2024, 6:11 pm

అర్హత కలిగిన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ స్కీమ్ కోసం బడ్జెట్ లో నిధులు భారీగా కేటాయించనున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో భాగంగా ఏడాదిలో 4.16 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

 
indiramma housing scheme

Representative Image


తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు సొంతింటి కల సాకారం చేసుకునేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ ను తీసుకొచ్చినప్పటికీ అర్హులందరికీ అవి అందలేదు. దీంతో కొత్త ప్రభుత్వమైనా తమకు ఇల్లు కట్టిస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రకటించింది. పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అదిస్తామని చెప్పింది. ఎస్టీ, ఎస్టీ సామజిక వర్గాలకు అయితే రూ. 6 లక్షలు సాయం అందిస్తామని హమీ ఇచ్చింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం లేకపోతే దాన్ని కూడా ఉచితంగానే అందిస్తామని హామీ ఇచ్చింది.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడు నెలలు పూర్తయింది. దీంతో ఇండ్ల మంజూరు కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. ఈ స్కీమ్ ను ప్రభుత్వం ఇప్పటికే తాత్కాలికంగా ప్రారభించింది. కొద్ది రోజుల క్రితం భద్రాచలంలో ఈ కార్యక్రమం జరిగింది. తాజాగా తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ హౌసింగ్ స్కీమ్ పై అధికారులతో సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తెలిపారు. బడ్జెట్ ను నిధులను భారీగా కేటాయించనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 22.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగాపెట్టుకున్నట్లు తెలిపారు. తొలి విడతలో భాగంగా ఈ ఏడాది ప్రతి నియోజక వర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఏడాదిలో 4,16,000 ఇండ్లు మంజూరు చేయనున్నట్లు వివరించారు. రిజర్వ్ కోటాలో 33,500 ఇండ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ఇండ్ల నిర్మాణం కోసం రూ. 22,500 కోట్లు అవసరం అవుతాయని, త్వరలో ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్డెట్ లో ఈమేరకు నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రికి సూచింనట్లు వివరించారు.

కాగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను డ్రా పద్ధతిలో ఎంపిక చేసే అవకాశమున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఇదే సరైన విధానమని భావిస్తున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడ లేదు. మరోవైపు మొదటి విడతలో సొంత జాగా ఉన్న వారికే ఇండ్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వ ఇప్పటికే స్పష్టం చేసింది. స్థలం లేని వారికి రెండో విడతలో ఉచితంగా స్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేస్తామని తెలిపింది.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలను నాలుగు విడతల్లో విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. దీని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More